Good News: పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గింపు

ఢిల్లీ (CLiC2NEWS): దేశంలో ప్ర‌జ‌లు ఇంధ‌న ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో అల్లాడిపోతున్న త‌రుణంలో కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా శుభ‌వార్తనందించింది. చ‌మురు, గ్యాస్‌పై ప‌న్నులు తగ్గించింది. లీట‌రు పెట్రోల్‌పై రూ. 8, డీజిల్‌పై రూ. 6 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. ఈ తాజా త‌గ్గింపుతో లీట‌రు పెట్రోల్‌పై రూ. 9.50లు, డీజిల్‌పై రూ. 7 త‌గ్గే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు, పిఎం ఉజ్వ‌ల్ యోజ‌న ప‌థ‌కం కింద 9 కోట్ల మంది ల‌బ్ధిదారుల‌కు ఒక్కో సిలిండ‌ర్‌పై రూ. 200 రాయితీ ఇస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. ఐర‌న్‌, స్టీల్‌పై కస్ట‌మ్స్ డ్యూటీని కేంద్రం త‌గ్గించింది. ప్లాస్టిక్ ఉత్ప‌త్తులు, ముడి ప‌దార్థాల‌తో పాటు ఉక్కు ముడి ప‌దార్థాల‌పై దిగుమ‌తి సుంకం తగ్గించ‌నున్న‌ట్లు తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.