మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల అమలుకు సర్కార్ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలోని మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం దుకాణాలను రాష్ట్ర సర్కార్ కేటాయించింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రిజర్వేషన్లు అమలు కోసం మంగళవారం సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రిజర్వేషన్లు 2021-23 నుంచి అమలులోకి రిజర్వేషన్లు అమలులోకి రానున్నాయి.