హైడ్రా అర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం.. గెజిట్ విడుదల

హైదరాబాద్ (CLiC2NEWS): హైడ్రాకి విస్తృత అధికారాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. నగరంలోని చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు , ఆట స్థలాలు సహా ప్రభుత్వ ఆస్తుల్ని సంరక్షించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సి (హైడ్రా)ను ఏర్పాటు చేసింది. హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం తెలపడంతో రాజభవన్ శనివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోందిచనున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు హైడ్రాకు ఈ ఆర్డినెన్స్ రక్షణగా ఉండనున్నట్లు సమాచారం.