టిడిపిలో చేరిన హీరో నిఖిల్ సిద్దార్థ్

అమరావతి (CLiC2NEWS): సిని హీరో నిఖిల్ సిద్దార్థ యాదవ్ టిడిపిలో చేరారు. టిడిపి జాతాయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పార్టీ తరపున పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక నిఖిల్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన స్వయంభు కోసం వర్క్ చేస్తున్నారు. భరత్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో సంయుక్త కాథానాయిక. చందు మొండేటి దర్శకత్వలో కార్తికేయ 3 అనౌన్స్ చేశారు.