హిమాయత్సాగర్ గేట్లు మూసివేత

హైదరాబాద్ (CLiC2NEWS): ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెరిచిన హిమాయత్సాగర్ జలాశయం గేట్లను వరద ఉధృతి తగ్గడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు మూసివేశారు. భారీ వర్షాల కారణంగా హిమాయత్సాగర్ జలాశయానికి వరద నీటి ప్రవాహం పెరగడంతో గత నెల (ఆగస్టు) 31న రెండు గేట్లను, ఈ నెల 1న మరో రెండు గేట్లను ఎత్తి 2100 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి వదలడం ప్రారంభించారు. అయితే, గత పది రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో జలాశయానికి వరద ప్రవాహం కూడా తగ్గింది. దీంతో జలాశయానికి వరద నీటి ప్రవాహం తగ్గుతున్నా కొద్ది ఒక్కో గేటును మూసేసిన అధికారులు ఇవాళ (శనివారం) చివరి గేటును కూడా రిజర్వాయర్ నీటి మట్టం 1762.55 అడుగుల వద్ద మూసివేశారు.
ఈ ఏడాది రెండుసార్లు
ఈ ఏడాది రెండుసార్లు హిమాయత్సాగర్ గేట్లు ఎత్తి వరదనీటిని దిగువకు వదలడం జరిగింది. మొదటిసారి జులై 20న గేట్లు తెరిచి వరద ఉధృతి తగ్గడంతో జులై 26న మూసివేశారు. రెండోసారి ఆగస్టు 31న నాలుగు గేట్లు తెరిచి నేడు చివరి గేటు మూసివేశారు.