ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం.. కాల్ సెంట‌ర్ నిర్వాహ‌కులు అరెస్టు

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసాల‌కు పాల్ప‌డుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. పంజాగుట్ట‌లో కాల్ సెంట‌ర్ నిర్వ‌హిస్తూ.. డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. మోసం చేస్తున్న వారిని అరెస్టు చేసిన‌ట్లు సిసిఎస్ డిసిసి స్నేహ‌మిశ్రా తెలిపారు. ఈ కేసులో ముగ్గురు కాల్ సెంట‌ర్ నిర్వాహ‌కుల‌ను, వారితో పాటు మొత్తం 32 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వ‌ద్ద నుండి నాలుగు బైక్‌లు, ఒక బిఎండ‌బ్ల్యూ కారు, రూ. 1,35,000 ల న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. ఇద్ద‌రు బాధితులు ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. కార్ణ‌ట‌క‌, కేర‌ళ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో బాధితులు ఉన్న‌ట్లు స‌మాచారం. బాధితుల నుండి రూ. 50 ల‌క్ష‌ల వ‌ర‌కు న‌గ‌దు సేక‌రించిన‌ట్లు .పోలీసులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.