నైపుణ్యం క‌లిగిన భార‌తీయ ఉద్యోగుల‌కు జ‌ర్మ‌నీ వీసాలు పెంపు: ప్ర‌ధాని మోడీ

Increase in number of visas for skilled Indian workers

ఢిల్లీ (CLiC2NEWS): భార‌త శ్రామిక శ‌క్తిపై జ‌ర్మ‌నీ ఉంచిన విశ్వాసం అద్భ‌త‌మ‌ని, నైపుణ్‌యం క‌లిగిన భార‌త శ్రామిక శ‌క్తి కోసం వీసాల సంఖ్య‌ను పెంచేందుకు జ‌ర్మ‌నీ నిర్ణ‌యించిన‌ట్లు ప్ర‌ధాని మోడీ తెలిపారు. వీసాల సంఖ్య‌ను 20 వేల నుండి 90 వేల‌కు పెంచింద‌ని తాజాగా వెల్ల‌డించారు. 18వ ఆసియా కాన్ఫ‌రెన్స్ ఆఫ్ జ‌ర్మ‌న్ బిజినెస్ లో ప్ర‌ధాని పాల్గొన్నారు. మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ ఒలాఫ్ షోల్జ్ భార‌త్‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ.. రాబోయే 25 ఏళ్ల‌కు విక‌సిత్ భార‌త్ కోసం రోడ్‌మ్యాప్ రూపొందించామ‌ని తెలిపారు.

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశంలో స‌మావేశం నిర్వ‌హించుకుంటున్నామని.. భార‌త్ వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్ధిక వ్య‌వ‌స్థ అని జ‌ర్మ‌ని ఛాన్స‌ల‌ర్ కొనియాడారు. ఫోక‌స్ ఆన్ ఇండియా పేరిట జ‌ర్మ‌నీ క్యాబినేట్ ఒక ప‌త్రాన్ని విడుద‌ల చేసింది. నైపుణ్యం క‌లిగిన భార‌తీయ ఉద్యోగుల‌కు వీసా సంఖ్య‌ను 20వేల నుండి 90 వేల‌కు పెంచింద‌ని, ఈ నిర్ణ‌యం దేవవృద్ద‌కి దోహ‌దం చేస్తుంద‌ని , భార‌త్ త‌యారీ కేంద్రంగా మారింద‌ని మోడీ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.