తొలి వన్డే మ్యాచ్లో ఆసీస్పై భారత్ విజయం
మొహాలీ (CLiC2NEWS): మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ శుక్రవారం ఆసీస్తో తొలి వన్డే మ్యాచ్ జరిగింది. టీమ్ ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు 276 పరుగులు చేసింది. 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు ఐదు వికెట్లు నష్టపోయి విజయం సొంతం చేసుకుంది.
భారత్ జట్టు: ఇషాన్ కిషన్, గిల్, శ్రేయస్, అయ్యర్, సూర్యకుమార్, రాహుల్, జడేజా, సుందర్, అశ్విన్, షమి, సిరాజ్, బుమ్రా. భారత్ జట్టుకు రోహిత్, విరాట్, కులదీప్ హార్దిక్ ఈ తొలి రెండు వన్డేల్లో విశ్రాంతినిచ్చారు. ఈ జట్టుకు రాహుల్ నాయకత్వం వహించాడు.