India Corona: కొత్త‌గా 3,26,098 కేసులు.. 3,890 మ‌ర‌ణాలు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 3,26,098 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు కేంద్ర వైద్య,ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,43,72,907 కి చేరింది.

గ‌డిచిన 24 గంటల్లో క‌రోనా నుంచి 3,53,299 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తంగా దేశంలో 2,04,32,898 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం దేశంలో 36,73,802 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.

గ‌డిచిన 24గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 3,890 మంది మృతిచెందారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో క‌రోనాతో బారిన ప‌డి మృతి చెందిన వారి సంఖ్య 2,66,207 కి చేరింది.

Leave A Reply

Your email address will not be published.