India Corona: 80 వేలకు దిగివచ్చిన కేసులు.. నేడు తగ్గిన మరణాలు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు లక్షకు దిగువనే నమోదవుతుండటం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 80,834 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆదివారం కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,94,39,989కి చేరింది.
గడిచిన 24 గంటల్లో దేశంలో 3,303 కరోనా మరణాలు సంభవించాయి. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,70,384కి చేరింది.
తాజాగా 1,32,062 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 2,80,43,446 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 10,26,159 కేసులు యాక్టివ్ ఉన్నాయి.