India Corona: కొత్తగా 40,134 కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంటల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 40,134 కొవిడ్‌ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.

  • తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,16,95,958కు పెరిగింది.
  • కొత్తగా 36,946 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 3,08,57,467 మంది బాధితులు కోలుకున్నారు.
  • మరో 422 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా మహమ్మారి ప్రభావంతో ఇప్పటి వరకు 4,24,773 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ప్రస్తుతం దేశంలో 4,13,718 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
  • ఇప్పటి వరకు దేశంలో 47,22,23,639 టీకాలు వేశారు.
  • గత 24 గంటల్లో 17,06,598 డోసులు వేసినట్లు బులిటెన్‌లో వివ‌రించారు.
Leave A Reply

Your email address will not be published.