వ‌రుస‌గా రెండో సారి పొట్టిక‌ప్ భార‌త్ కైవ‌సం

IND vs NZ:  అహ్మ‌దాబాద్ వేదిక‌గా పొట్టిక‌ప్ ను సొంతం చేసుకుంది భార‌త్ జ‌ట్టు. టి20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో న్యూజిలాండ్‌పై భార‌త్ విజ‌యం సాధించింది. 256 ప‌రుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ జ‌ట్టు 159 ప‌రుగుల‌కు ఆలౌట‌యింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భార‌త్ 255/5 స్కోర్ సాధించింది.

టిమ్ సీఫెర్ట్ 52, శాంట్న‌ర్‌ 43, మిచెల్ 17 ప‌రుగులు చేశారు. ప‌టేల్ 3, బూమ్రా 4 వికెట్లు తీయ‌గా..  పాండ్య‌, వ‌రుణ్ చెరో వికెట్ తీశారు.

మూడో సారి క‌ప్ సొంతం చేసుకుని అత్యధిక సార్లు టి20 ప్ర‌పంచ క‌ప్ నెగ్గిన తొలి జ‌ట్టుగా టీమ్ ఇండియా నిలిచింది. త‌ర్వాతి స్థానాల్లో వెస్టిండీస్‌, ఇంగ్లాండ్ ఉన్నాయి.

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో భార‌త్ స్కోర్ 255/5

Leave A Reply

Your email address will not be published.