వ‌రల్డ్ క‌ప్‌లో పాక్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం

బే ఒవ‌ల్ (CLiC2NEWS): వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా పాకిస్తాన్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ 107 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. కాగా పాక్‌పై భార‌త్‌కు ఇది వ‌రుస‌గా 11వ విజ‌యం.

245 మంది ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన దాయాది జ‌ట్టు 137 ప‌రుగుల‌కు అలౌట‌యింది. దీంతో టీమ్ ఇండియా ప్ర‌పంచ క‌ప్‌లో బోణీ కొట్టింది.

భార‌త్ బౌల‌ర్ల‌లో రాజేశ్వ‌రీ గైక్వాడ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, గోస్వామి, స్నేహ్ రానా చేరో రెండు వికెట్లు సాధించారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్ నీర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 244 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో పూజా వ‌స్త్రాక‌ర్ అద్భుతంగా రాణించింది.

పాక్ ఓపెన‌ర్ సిద్రా అమీన్ (30; 64 బుంతుల్లో 3×4)) టాప్‌స్కోర‌ర్‌గా నిలిచింది.

Leave A Reply

Your email address will not be published.