ఐపిఎల్ టైటిల్ రాయల్ ఛాలెంజర్స్దే..

IPL: ఐపిఎల్ 18వ సీజన్ ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ టైటిల్ సొంతం చేసుకుంది. ఐపిఎల్ చరిత్రలోనే ఆర్సిబికి ఇది తొలి టైటిల్ అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ పోరులో ఆర్సిబి ,పంజాబ్తో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. విరాట్ 43, మయాంక్ 24, రజత్ పాటిదార్ 26, లివింగ్స్టన్ 25, జితేశ్ శర్మ 24 పరుగులతో రాణించారు.
అనంతరం 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. జోష్ 39 , శశాంక్ ప్రబ్ 61*, సిమ్రాన్ సింగ్ 26 , ప్రియాష్ ఆర్య 24 పరుగులు చేశారు.