9 ఏళ్ల నిరీక్షణ అనంతరం ఫైనల్కు చేరిన రాయల్ ఛాలెంజర్స్

IPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) అద్భెతమైన విజయంతో ఫైనల్కు చేరుకుంది. గురువారం జరిగిన ప్లే ఆప్స్ మ్యాచ్లో ఆర్సిబి పంజాబ్ జట్టును చిత్తుగా ఓడించింది. 2016 తర్వాత తొలిసారి ఐపిఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. పంజాబ్ జట్టు 2014 తర్వాత తొలిసారి ప్లే ఆప్స్ ఆడుతుంది. పాయింట్ల పట్టికలో మొదటి , రెండో స్థానాల్లో నిలిచిన పంజాబ్, బెంగళూరు జట్లు క్వాలిఫయర్-1లో పోటీ పడగా.. బెంగళూరు జట్టు కేవలం 10 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 14.1 ఓవర్లకు 101 పరుగులు చేసి ఆలౌటయింది. ఆర్సిబి ఈ స్వల్స లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి ఫైనల్కు దూసుకుపోయింది. ఈ మ్యాచ్లో ఓడినా కానీ.. పంజాబ్ జట్టుకు ఫైనల్కు చేరడానికి మరో అవకాశం ఉంది. నేడు జరిగే ఎలిమినేటర్ విజేతతో పంజాబ్ తలపడతుంది. నేడు ముంబయి ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్తో తలపడుతోంది.
ఆర్సిబి జట్టు ఐపిఎల్ ఫైనల్కు చేరడం ఇది నాలుగోసారి .. ఇంతకు ముందు 2009, 2011, 2016లో ఫైనల్కు చేరుకుంది.