ఎపి స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో ఉద్యోగాలు.

విజయవాడ (CLiC2NEWS): ఎపి స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్సీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. విజయవాడలో ఉన్న ఈ సంస్థలో పలు విభాగాల్లో కలిపి మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- ఖాళీలు:
నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 23 ఖాళీలకు గాను
- మేనేజర్లు (09)
- డిప్యూటీ మేనేజర్లు (03)
- అసిస్టెంట్ మేనేజర్లు (11) పోస్టులను భర్తీ చేయనున్నారు.
- అర్హతలు:
దరఖాస్తు చేసుకునే వారు పోస్టులను అనుసరించి సీఏ/ సీఎంఏ/ బీటెక్తో పాటు ఎంబీఏ / పీజీడీఎం, బ్యాచిలర్ / పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ లా ఇన్ బిజినెస్/ కమర్షియల్ లా ఉత్తీర్ణతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. - వయస్సు:
అభ్యర్థుల వయసు 01-08-2021 నాటికి 21 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. - ఫీజు:
జనరల్ /బీసీ అభ్యర్థులకు రూ. 1003, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ. 590 ఫీజుగా నిర్ధారించారు. - ఎంపిక:
అభ్యర్థులను ఆన్లైట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. - దరఖాస్తు:
ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ నేడు (16-09-2021) ప్రారంభం
చివరి తేదీగా 10-10-2021ని నిర్ణయించారు.
పూర్తి వివరాలకు https://esfc.ap.gov.in/ను చూడగలరు.