లోక్పాల్ ఛైర్పర్సన్: సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్
ఢిల్లీ (CLiC2NEWS): సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్.. లోక్పాల్ ఛైర్పర్సన్గా నియమితులయ్యారు. మంగళవారం రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. జస్టిస్ ఖాన్విల్కర్ 2022 జులైలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. ఇప్పటి వరకు జస్టిస్ ప్రదీప్ కుమార్ మొహంతి ప్రస్తుతం తాత్కాలిక ఛైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. 2022 మేలో భారత్ తొలి లోక్పాల్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ పదవీకాలం ముగిసింది.