తెలంగాణ హైకోర్టు నూతన సిజెగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ప్రస్తుతం హైకోర్టు సిజెగా ఉన్న జస్టిస్ సతీష్చంద్ర శర్మను బదిలీ చేసి ఆయన స్థానంలో ఉజ్జల్ భుయాన్కు పదోన్నతి ఇవ్వాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఆ మేరకు ఇవాళ ఉత్తర్వులు వెలువడినాయి. జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు.