అవిశ్వాసంలో ఓడిపోయిన కాకినాడ మేయర్
కాకినాడ (CLiC2NEWS): కాకినాడ మేయర్పై తెలుగుదేశం పార్టీ అసమ్మతి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసంలో మేయర్ పావని, ఉపమేయర్-1 సత్తిబాబు ఓడిపోయారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 33 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్అఫీసియో సభ్యులతో కలిపి మొత్తం 36 ఓట్లు వచ్చాయి.
- కాకినాడ మున్సిపల్ కౌన్సిల్లో మొత్తం కార్పొరేటర్లు 44 మంది
- ఎక్స్ అఫిషియో సభ్యులు ముగ్గురు
- అవిశ్వాస తీర్మానానికి కోరం 31 మంది
- సమావేశానికి హాజరైన వారు 43 మంది కార్పొరేటర్లు,
- 3 ఎక్స్అఫిషియో సభ్యులు.
ఎక్స్ అఫిషియో సభ్యులుగా మంత్రి కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగా గీత ఓటువేశారు.
కోర్టు కేసు నేపథ్యంలో ఫలితాలను ప్రిసైడింగ్ అధికారి రిజర్వ్ చేశారు. కోర్టు తీర్పు తర్వాత ఫలితాలనుఅధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.