లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ ఓట‌మితో బిఆర్ఎస్‌కు దిష్టిపోయింది: కెసిఆర్‌

గ‌జ్వేల్‌ (CLiC2NEWS): కాంగ్రెస్‌పై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డే రోజులు త్వ‌ర‌లోనే వ‌స్తాయ‌ని మాజి సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. మ‌హ‌బూబాబాద్‌, మేడ్చ‌ల్‌, న‌ల్గొండ‌, జిల్లా నేత‌లు, కార్య‌కర్త‌ల‌తో కెసిఆర్ స‌మావేశ‌మయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓట‌మితో బిఆర్ ఎస్ పార్టికి దిష్టి తీసిన‌ట్లైంద‌న్నారు. కాంగ్రెస్ పాల‌న‌పై ప్ర‌జ‌లు విర‌క్తితో ఉన్నార‌ని, కాంగ్రెస్‌కు ఓటేసి పొర‌పాటు చేశామ‌నే విష‌యం ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మైంద‌న్నారు. పున‌రుత్తేజంతో మ‌రింత‌గా ప్ర‌జాదర‌ణ కూడ‌గ‌ట్టాల‌ని పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.