కౌశిక్​రెడ్డికి షాక్: మాణిక్కం ఠాగూర్‌ లీగల్‌ నోటీసు

హైద‌రాబాద్ (CLiC2NEWS): కౌశిక్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జీ మాణిక్కం ఠాగూర్ లీగ‌ల్ నోటీసులు పంపారు. దీంతో హుజురాబాద్‌ నేత కౌశిక్‌రెడ్డికి మరో షాక్‌ తగిలింది. తెలంగాణ పిసిసి చీఫ్‌గా రేవంత్​రెడ్డిని నియమించేందుకు రూ. 50 కోట్లు తీసుకున్నారంటూ కౌశిక్‌రెడ్డి ఆరోపణలు చేయడంపై సీరియస్‌గా స్పందించిన మాణిక్కం ఠాగూర్ లీగల్​ నోటీసులు పంపారు. కౌశిక్‌కు మదురై కోర్టు నుంచి ఈ లీగల్​నోటీసు జారీ అయ్యాయి. దీనిపై వారం రోజుల్లో రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో డిమాండ్ చేశారు. లేక‌పోతే కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.