శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తివేత

నిజామాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న భార్షాలతో ప్రాజెక్టులోకి 3.50 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 33 గేట్లను ఎత్తివేసి 4.04 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
- శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులుక
- ప్రస్తుత నీటిమట్లం 1089.3 అడుగులు
- ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 90 టీఎంసీలు.
- ప్రస్తుతం 81.17 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
కాగా నిజాంసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్టులోకి 44,771 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో 12,652 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
- నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 1404.16 అడుగుల నీటిమట్టం ఉన్నది.
- పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు.
- జలాశయం నీటిసామర్థ్యం 17.8 టీఎంసీలు
- ప్రస్తుతం 16.5 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.