చిరు-చరణ్ కలిసి స్టెప్పేస్తే..
హైదరాబాద్ (CLiC2NEWS): కొరటాల శి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. తాజాగా చిత్ర బృందం ‘భలే భలే బంజారా..’ పాటను విడుదల చేసింది. చిత్రంలోని ‘భలే భలే బంజారా.. సిరుత పులల సిందాట’ పాటలో చిరంజీవి- రామ్చరణ్ కలిసి డ్యాన్స్చేశారు. తండ్రి, కొడుకులు కలిసి ఒకే ఫ్రేమ్లో నిలబడితే అభిమానులకు పండగే. ఈ పాటకు మణిశర్య సంగీతం అందించగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్నావిషయం తెలిసినదే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే కథానాయకలుగా ఉన్నారు. ఈ చిత్రంను నిరంజన్ రెడ్డి, అన్నేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.