స్వ‌తంత్య్ర భార‌త‌దేశంలో చేనేత‌పై ప‌న్ను వేసిన తొలి ప్ర‌ధాని మోడి

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): క‌రోనా సంక్షోభంలోనూ టెక్స్‌టైల్స్ రంగంపై మోడీ ప‌న్నుల భారం వేశార‌ని, స్వ‌తంత్య్ర భార‌త‌దేశంలో చేనేత‌పై ప‌న్ను వేసిన మొద‌టి ప్ర‌ధాని మోడీ అని మంత్రి కెటిఆర్ ధ్వ‌జ‌మెత్తారు. మోడీ నిర్ణ‌యాల‌వ‌ల్లే టెక్స్‌టైల్ రంగం కునారిల్లుతున్న‌ద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నేత‌న్న‌ల సంక్షేమంపై బిజెపి రాష్ట్ర ఆధ్య‌క్షుడు బండి సంజ‌య్‌కు ఆయ‌న బ‌హిరంగ లేఖ రాశారు.

చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనంత భారీగా చేనేత రంగానికి తెలంగాణ ప్ర‌భుత్వం బ‌డ్జెట్ కేటాయిస్తోంది. ప్ర‌త్యేక పొదుపు ప‌థ‌కంతో నేత‌న్న‌కు చేయూత‌నిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చేకేఏ నేత‌న్న‌ల ఆత్మ‌హ‌త్య‌లు ఆగిన విష‌యం బండి సంజ‌య్‌కు క‌నిపించ‌డం లేదా? అని ప్ర‌శ్నించారు. దేశంలో ఎక్క‌డాలేని విధంగా నేతన్న‌ల‌కు యార్న్ స‌బ్సిడీ ఇస్తున్న ఏకైక మిత్ర ప్ర‌భుత్వం మాదేఅని అన్నారు. ముంబ‌యి, భివాండి, సూర‌త్ వంటి ప్రాంతాల నుంచి తెలంగాణ‌కు నేత కార్మికులు తిరిగి వ‌స్తున్న‌ది నిజం కాదా? నేత‌న్న‌ల‌కు ఉన్న బీమాను ఎత్తేసిన కేంద్ర నిర్ణ‌యంపై బండి సంజ‌య్ మాట్లాడాలి . టిఆర్ ఎస్ ప్ర‌భుత్వం నేత‌న్న‌కు ప్ర‌త్యేక బీమా క‌ల్పిస్తోంద‌ని, దేశంలోనే అతిపెద్ద కాక‌తీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌కి కేంద్రం నుంచి అందిన సాయంపై బండి సంజ‌య్ సామాధానం చెప్పాల‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.