నేపాల్లో అదృశ్య‌మైన విమానం.. గుర్తింపు

ఖాట్మండు (CLiC2NEWS): నేపాల్‌లోని ముస్తాంగ్లో ఆచూకీ గ‌ల్లంతైన తారా ఎయిర్‌లైన్స్ విమానం ప్ర‌మాదానికి గురైన‌ట్లు తెలిసింది. ముస్తాంగ్ జిల్లాలోని కొవాంగ్ గ్రామం వ‌ద్ద విమానం కుప్ప‌కూలిన‌ట్లు నేపాల్ ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్ల‌డించారు.

తారా ఎయిర్‌లైన్స్‌కి చెందిన 9 ఎన్ ఎఈటి ట్విన్ ఇంజిన్ విమానం ఆదివారం ఉద‌యం పొఖారా నుండి జామ్‌సోమ్‌కు బ‌య‌లు దేరిన త‌ర్వాత ఎటిసితో సంబంధాలు తెగిపోయాయిన విష‌యం తెలిసిన‌దే. విమానం ఆచూకీ కోసం గాలించిన ఆర్మీకి నది ముఖ‌ద్వారం వ‌ద్ద విమానం కూలిపోయింద‌ని స్థానికులు స‌మాచారం అందించారు. ప్ర‌మాదానికి గురైన విమాన పైల‌ట్ సెల్‌ఫోన్ సిగ్న‌ల్ ఆధారంగా ఆర్మీ అధికారులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న‌ట్లు స‌మాచారం.

త‌ప్ప‌క చ‌ద‌వండి:

22 మంది ప్ర‌యాణిస్తున్న విమానం ఆచూకీ గల్లంతు..

Leave A Reply

Your email address will not be published.