ప‌వ‌న్ సూప‌ర్ గెలుపుతో.. త‌న పేరు మ‌ర్పుపై ముద్ర‌గ‌డ స్పందన‌!

కిర్లంపూడి (CLiC2NEWS): జ‌న‌సేనాని సూప‌ర్ గెలుపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో చ‌రిత్ర సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ అద్భుత విజ‌యంతో మీడియా ప‌వ‌న్ ను ఆకాశానికెత్తింది. ఈ ఎన్నిక‌ల్లో `మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌` ప‌వన్ అంటూ ప‌లు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

ఈ నేప‌థ్యంలో పిఠాపురంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ ను ఓడించ‌క పోతే త‌న పేరు మ‌ర్చుకుంటాన‌ని స‌వాల్ విసిరిన మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఇవాళ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కిర్లంపూడిలో మీడియాతో మాట్లాడారు.

“పిఠాపురంలో ప‌వ‌న్ ను ఓడిస్తాన‌ని స‌వాల్ చేశా.. అలా చేయ‌క‌పోతే నా పేరు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభ రెడ్డిగా మార్చుకుంటాన‌ని చెప్పా.. పేరు మార్చాల‌ని గెజిట్ ద‌ర‌ఖాస్తు పెట్టుకుంటా“ అని ముద్ర‌గ‌డ తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.