ప్రధాని మోడీకీ నమీబియా అత్యున్నత పురస్కారం..
ప్రధాని నరేంద్ర మోడీ.. నమీబియా అత్యున్నత పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఎన్షియంట్ వెల్విట్షియా మిరాబిలిస్’ ను అందుకున్నారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా చివరిదైన నమీబియాలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నమీబియా అధ్యక్షురాలు నెతుంబో నంది-ద్వైత్వా మోడీకి పురస్కారం అందజేశారు. ఈ దేశంలో పర్యటిస్తున్న మూడవ ప్రధాని మోడీ కాగా.. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ నేత మోడీయే. ఇప్పటి వరకు మోడీకి 27 అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు.