నీట్ పిజి పరీక్ష వాయిదా..

NEET EXAM: వైద్య విద్యాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పిజి పరీక్ష వాయిదా పడింది. ఈ నెల 15న నీట్ పిజి పరీక్ష జరగాల్సి ఉండగా.. పరీక్షను వాయిదా వేశారు. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్షను ఒకే షిప్టులో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పరీక్ష నిర్వహించే కొత్త తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.
జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పిజి పరీక్షకు తగిన సంఖ్యలో పరీక్ష కేంద్రాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం నీట్ పిజి పరీక్ష వాయిదా వేస్తున్నట్లు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షను రెండు షిప్టులలో నిర్వహించడం కొన్ని సమస్యాలకు కారణమవుతోందని.. ఒకే షిప్టులో ముగించాలని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ ఎన్.వి.అంజారియా ధర్మసనం పేర్కొంది. పరీక్ష నిర్వహణలో పూర్తి పారదర్శకతను పాటించాలని , సురక్షితమైన పరీక్ష కేంద్రాలనే ఎంచుకోవాలని సూచించింది.