దేశంలో కొత్తగా 6,990 కరోనా కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో 7 వేల దిగువకు రోజువారీ కరోనా మహమ్మారి కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,990 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా దేశంలో కరోనా బారిన పడి 190 మంది మరణించారు. అలాగే కొత్తగా కరోనా నుంచి 10,116 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 1,00,543 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.