త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ .. చంద్రబాబు
పార్టి కోసం కష్టపడిన కార్యకర్తల రుణం తీర్చుకుంటా..

అమరావతి (CLiC2NEWS): తెలుగుదేశం పార్టి కోసం కష్టపడిన కార్యకర్తల రుణం తీర్చుకుంటానని.. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తామన్నారు సిఎం చంద్రబాబు నాయుడు. ఎపి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఆయన మంగళగిరిలోని ఎన్టిఆర్ భవన్కు విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన పార్టి నేతలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఎంపిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బూత్స్థాయి కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. కిందిస్థాయి నుండి ఎవరు ఎక్కడ పార్టి కోసం పని చేశారో వారికే పదవులు దక్కాలని .. ఆవిధంగా అధ్యయనం చేపట్టాలన్నారు. నేతలు, కార్యకర్తలు సాధికారత సాధిస్తే పార్టి పునాదులు బలంగా ఉంటాయని చంద్రబాబు పేర్కొన్నారు.
ఐదేళ్ల పాటు కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారని.. వారి రుణం తప్పకుండా తీర్చుకుంటానన్నారు. అధికారం ఉందని కక్ష సాధింపులు, ప్రజా వ్యతిరేక పనులు చేయవద్దని సిఎం సూచించారు.