Huzurabad: నేటి నుంచి నామినేషన్లు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ‌లోని హుజూరాబాద్‌ ఉపఎన్నికకు శుక్రవారం నుంచి నామినేషన్లు మొదలవుతున్నాయి. 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ ఉపఎన్నికకు హుజూరాబాద్‌ ఆర్డీవో రవీందర్‌రెడ్డిని రిటర్నింగ్‌ అధికారిగా నియమించారు. అభ్యర్థులు హుజూరాబాద్‌ ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు.

కాగా ఈ నామినేషన్‌ సమయంలో ఎలాంటి ఊరేగింపులు, మీటింగ్‌లకు అనుమతి లేదని పేర్కొన్నారు. నామినేషన్లు వేసేవారు మూడు వాహనాల్లో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాలనికి వందమీటర్ల దూరం వరకుమాత్రమే వెళ్లడానికి అనుమతి ఉంటుందని చెప్పారు. నామినేషన్‌ వేసే సమయంలో అభ్యర్థితోపాటు ఇద్దరికి మాత్రమే లోపలకు ప్రవేశం ఉంటుందని తెలిపారు. గతంలో ఇచ్చిన కొవిడ్‌ మార్గదర్శకాల ప్రకారంగానే ఎన్నికల నిర్వహణ ఉంటుందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.