న‌ర్సు నిర్ల‌క్ష్యానికి ప‌సిప్రాణం బ‌లి..

ల‌క్నో (CLiC2NEWS): ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖ్‌న‌వూలో న‌ర్సు నిర్ల‌క్ష్యానికి ఓ ప‌సికందు ప్రాణం పోయింది. న‌ర్సు చేతిలోంచి జారిపోయి అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందాడు. ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో మ‌హిళ మ‌గ శిశువుకు జ‌న్మ‌నిచ్చింది. అయితే ట‌వ‌ల్ సాయం లేకుండా శిశువును న‌ర్సు ఒంటి చేత్తో ఎత్తుకోవ‌డంతో ఆ శిశువు జారి కింద‌ప‌డిపోయాడు. దీంతో త‌ల‌కు గాయ‌మై ఆ శిశువు మ‌ర‌ణించాడు. ఇది చూసిన త‌ల్లి కేక‌లు పెట్ట‌డంతో భ‌యాందోళ‌న‌కు గురైన కుటుంబీకులు డెలివ‌రీ రూంలోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. వారిని ఆస్ప‌త్రి సిబ్బంది అడ్డుకుని మృత శిశువు జ‌న్మించింద‌ని బుకాయించే ప్ర‌య‌త్నం చేశారు. శిశువు ఆరోగ్యంగానే పుట్టాడ‌ని, న‌ర్సు త‌ప్పిదం వ‌ల్లే కింద‌ప‌డి మృతి చెందాడ‌ని స‌ద‌రు త‌ల్లి చెప్ప‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. దీంతో బాధిత కుటుంబం పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. శిశువు మృత‌దేహాన్ని పోస్టు మార్టం నిర్వ‌హించ‌గా త‌ల‌కు గాయం కార‌ణంగానే శిశువు మర‌ణించిన‌ట్లు నివేదిక‌లో వెల్ల‌డైంది.

Leave A Reply

Your email address will not be published.