యాదాద్రి కొండ‌పైకి వాహ‌నాల‌కు అనుమ‌తి..

వాహ‌నం పార్కింగ్‌ గంట వ‌ర‌కు రూ. 500, త‌ర్వాత ప్ర‌తి గంట‌కు రూ. 100

యాద‌గిరిగుట్ట (CLiC2NEWS): యాదాద్రి శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తుల వాహ‌నాల‌కు కొండ‌పైకి అనుమ‌తి ల‌భించింది. గ‌త కొంత‌కాలంగా భ‌క్తుల వాహ‌నాల‌ను కొండ‌పైకి అనుమ‌తించాల‌ని వ‌స్తున్న అభ్య‌ర్థ‌న‌ల నేప‌థ్యంలో ఆల‌య అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. రేప‌టినుండి భ‌క్తుల వాహ‌నాల‌ను కొండ‌పైకి అనుమ‌తించాల‌ని నిర్ణ‌యించారు. అయితే కొండ‌పైకి వ‌చ్చే వాహ‌నాల‌కు ప్ర‌వేశ రుసుం వ‌సూలు చేయాల‌ని పాల‌క మండ‌లి నిర్ణ‌యించింది. వాహ‌నం పార్కింగ్ చేసిన గంట వ‌ర‌కు రూ. 500, ఆ త‌ర్వాత ప్ర‌తి గంట‌కు రూ. 100 చొప్పున వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ఈఓ గీత తెలిపారు. ప్రొటోకాల్, దాత‌ల వాహ‌నాల‌కు ప్ర‌వేశ రుసుం మిన‌హాయింపు ఉంటుందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.