రైతుల‌కు శుభ‌వార్త‌..

జూన్ 18న పిఎం-కిసాన్ నిధులు

ఢిల్లీ (CLiC2NEWS):  కేంద్ర ప్ర‌భుత్వం రైతుల‌కు శుభ‌వార్త‌నందించింది. ఈ నెల 18వ తేదీన పిఎం కిసాన్ నిధులు విడుద‌ల చేయ‌నున్నారు. రైతుల ఖాతాల్లో 17వ విడ‌త రూ. 2 వేలు చొప్పున జ‌మ‌కానున్నాయి. ఈ మేర‌కు కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ‌రాజ్ చౌహ‌న్ శ‌నివారం వెల్ల‌డించారు. మూడోసారి ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన న‌రేంద్ర మోడీ తొలి సంత‌కం పిఎం-కిసాన్ నిధుల‌కు సంబంధించిన ద‌స్త్రంపై చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వార‌ణాసి నుండి మోడీ ఈ నిధులు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

2018 నుండి పిఎం – కిసాన్ ప‌థ‌కం అమ‌లు చేస్తున్నారు. దీనికింద అర్హులైన రైతుల‌కు ఏడాదికి మూడు విడ‌త‌ల్లో రూ. 2 వేలు చొప్పున ఏటా రూ. 6 వేలు పెట్టుబ‌డి సాయంగా ఇస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.