రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ నిధులు విడుదల
PM Kisan Samman Nidhi: రైతన్నలకు పంట పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధులను విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం వారణాసిలో జరిగిన కార్యక్రమంలో పిఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. ఏడాదికి ఒక్కో విడతకు రూ.2వేలు చొప్పున మూడు విడతల్లో రూ.6వేలు సాయం అందిస్తారు. ఈ పథకం కింద 2019 ఫిబ్రవరి 24 నుండి ఇప్పటి వరకు 19 వాయిదాల్లో రూ. 3.46 లక్షల కోట్లు అందజేసింది. ప్రస్తుతం తాజాగా 20వ విడత నిధులు విడుదల చేశారు. పిఎం కిసాన్ హెల్ప్లైన్ నెంబరు 155261/ 011-24300606
తప్పక చదవండి: బిఎస్ఎఫ్లో 3,588 కానిస్టేబుల్ పోస్టులు