ప్ర‌పంచంలోనే ఎత్తైన బ్రిడ్జిని ప్రారంభించిన ప్ర‌ధాని మోడీ..

Chinab Railway Bridge: బ్రిటిష్ కాలం నాటి ప్ర‌ణాళిక నేటికి సాకారమ‌య్యింది. ప్ర‌పంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిని శుక్ర‌వారం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్రారంభించారు. శివాలిక్‌, పీర్ , పంజాల్ ప‌ర్వ‌త శ్రేణుల‌ను క‌లుపుతూ   చినాబ్ ఉక్కు వంతెన నిర్మాణం జ‌రిగింది. క‌ట్‌డా నుండి క‌శ్మీర్‌కు వందేభార‌త్  రైలుకు నేడు ప్ర‌ధాని జెండా ఊపి వంతెన‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ బ్రిడ్జి వ‌ల‌న జ‌మ్ము నుండి శ్రీ‌న‌గ‌ర్‌కు ప్ర‌యాణ స‌మ‌యం త‌గ్గుఉతంది.

చినాబ్ బ్రిడ్జి ఈఫిల్ ట‌వ‌ర్ కంటే 30 మీట‌ర్లు ఎత్తు ఎక్కువ‌. న‌దీ కేంద్రం నుండి మొత్తం 359 మీట‌ర్ల ఎత్తులో ఉంటుంది. దాదాపు రూ.1485 కోట్ల ఖ‌ర్చుతో నిర్మించిన  ఈ బ్రిడ్జి పొడ‌వు 1.31 కిలో మీట‌ర్లు ఉంటుంది.   అతి వేగం, భూకంపాలు, వ‌ర‌ద‌లు, బాంబు పేలుళ్ల‌ను సైతం త‌ట్టుకునేలా బ్రిడ్జి నిర్మాణం జ‌రిగింది. 2002 లో అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ హ‌యాంలో ఈ ప్రాజెక్టుకు రూప‌క‌ల్ప‌న చేయ‌గా.. నేటికి అందుబాటులోకి వ‌చ్చింది.

Leave A Reply

Your email address will not be published.