పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని ఉద్యోగార్థుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త‌నందించింది. తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల‌కు  ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 16,027 కానిస్టేబుల్‌ ఉద్యోగాల‌కు, 587 ఎస్ఐ ఉద్యోగాల‌కు ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.
ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు. మే 2వ తేదీ నుండి 20వ తేదీ వ‌ర‌కు అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివ‌రాల‌కు www.tslprb.in వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

16,027 కానిస్టేబుల్,
587 ఎస్ ఐ పోస్టులు,

414 సివిల్ ఎస్ ఐలు,

66 ఎఆర్ ఎస్ ఐలు,

5 రిజ‌ర్వ్ ఎస్ ఐలు,

23 టిఎస్ ఎస్ పి ఎస్ఐ,

12 ఎస్‌పిఎఫ్ ఎస్ఐ,

అగ్నిమాప‌క శాఖ‌లో 26 స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ పోస్టులు,
8 డిప్యూటి జైల‌ర్ పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.