రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ప్రశాంత్ పాటిల్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ప్రశాంత్ పాటిల్ జీవన్ నియమితులయ్యారు. ఆయన సిద్దిపేట జిల్లా కలెక్టర్గా విధుల నిర్వహిస్తున్నారు. ఆయన స్థానంలో మిక్కిలినేని మను చౌదరి నియమితులయ్యారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్యర్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.