మహాత్ముడికి నివాళులర్పించిన రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ

న్యూఢిల్లీ (CLiC2NEWS): భారత జాతిపిత మహాత్మా గాంధీ, దేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా పలువురు ప్రముఖులు న్యూఢిల్లీలోని రాజ్ఘాట్, విజయ్ఘాట్ వద్ద రామ్నాథ్ కోవింద్, మోదీ, సోనియా గాంధీ తదితరులు పుష్పాంజలి ఘటించారు. మహాత్మాగాంధీ 152వ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి 117వ జయంతి ఉత్సవాల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లాల్ బహదూర్ శాస్త్రీ కుమారుడు అనిల్ శాస్త్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ, శాస్త్రి సేవలను పలువురు నేతలు కొనియాడారు.
#WATCH President Ram Nath Kovind pays tribute to Mahatma Gandhi at Rajghat on his 152nd birth anniversary pic.twitter.com/kMA7U1JLAu
— ANI (@ANI) October 2, 2021