పివికి భార‌త‌ర‌త్న ప్ర‌దానం.. స్వీక‌రించిన కుమారుడు

ఢిల్లీ (CLiC2NEWS): మాజి ప్ర‌ధాన‌మంత్రి పివి న‌ర‌సింహారావుకు కేంద్ర ప్ర‌భుత్వం దేశ అత్యున్న‌త పుర‌స్కారం భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. శ‌నివారం ఢిల్లీలోని రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో భార‌తర‌త్న పుర‌స్కార ప్ర‌ధానోత్స‌వం నిర్వ‌హించారు. రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా పుర‌స్కారాన్ని పివి న‌ర‌సింహారావు కుమారుడు ప్ర‌భాక‌ర్‌రావు అందుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి కేంద్ర‌మంత్రులు అమిత్‌షా, జైశంక‌ర్, కిష‌న్ రెడ్డ్, బిజెపి జాతీయాధ్య‌క్షుడు జెపి న‌డ్డా, కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Leave A Reply

Your email address will not be published.