ప‌ట్టుద‌ల, పౌరుషానికి మారు పేరు తెలంగాణ‌: ప్ర‌ధాని మోడీ

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప‌ట్టుద‌ల‌, పౌరుషానికి మారు పేరు తెలంగాణ అని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. హైదరాబాద్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇవాళ (గురువారం) ప్రధాని మోడీ బేగంపేట విమాన్రాశ్ర‌యంలో ఏర్పాటు చేసిన స్వాగ‌త స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మాట్లాడుతూ..

“తానెప్పుడు తెలంగాణ‌కు వ‌చ్చిన అపూర్వ స్వాగతం ప‌లుకుతున్నారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు. తెలంగాణ కోసం ఆత్మార్ప‌ణ చేసిన ప్ర‌తీ ఒక్క‌రికీ నా శ్ర‌ద్ధాంజ‌లి. స‌ర్దార్ ప‌టేల్ అడుగుజాడ‌ల్లో న‌డిచే వాడిని నేను.. ఆయ‌న క‌ల‌లు సాకారం చేద్దాం.. దేశ ఐఖ్య‌త కోసం స‌ర్ధార్ ప‌టేల్ ఎంతో కృషి చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమ‌రుల‌తో పాటు ఎవ‌రి ఆశ‌యాలు కూడా నెర‌వేర‌డం లేదు. కుటుంబ పాల‌న‌లో తెలంగాణ బందీ అయింది. కేవ‌లం ఒక కుటుంబం కోసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జ‌ర‌గ‌లేదు.

తెలంగాణ‌లో అధికార మార్పిడి త‌ప్ప‌క జ‌రుగుతుంది. రాష్ట్రంలో బిజెపి హ‌వా న‌డుస్తోంది. రాష్ట్రం లో పార్టీ అధికారంలోకి వ‌చ్చి తీరుతుంది. “ అని ప్ర‌ధాని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.