అసెంబ్లీలో పివి చిత్ర‌ప‌టం ఆవిష్క‌ర‌ణ‌

హైద‌రా‌బాద్ (CLiC2NEWS): భారత మాజీ ప్రధాన మంత్రి, తెలం‌గాణ ముద్దు‌బిడ్డ పివి నర‌సిం‌హా‌రావు చిత్రప‌టాన్ని శుక్రవారం అసెంబ్లీ లాబీలో ముఖ్య‌మంత్రి కెసిఆర్, స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి ప్రొటెం చైర్మ‌న్ భూపాల్ రెడ్డితో క‌లిసి ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా సిఎం కెసిఆర్‌, అసెంబ్లీ స్పీక‌ర్, ప్రొటెం చైర్మ‌న్‌తో పాటు ప‌లువురు నాయ‌కులు పివి చిత్ర‌ప‌టానికి పుష్పాంజ‌లి ఘ‌టించారు.

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు, ఎమ్మె‌ల్సీలు, ఎమ్మె‌ల్యే‌లతో పాటు ఎమ్మెల్సీ, పివి కుమార్తె సుర‌భి వాణీదేవీ, ఆమె కుటుంబ‌స‌భ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.