2020 న‌వంబ‌ర్‌లో నేను చెప్పిందే ఇప్పుడు నిజ‌మైంది.. ర‌ఘ‌నంద‌న్‌రావు

హైద‌రాబాద్ (CLiC2NEWS): బిజెపి నేత ర‌ఘ‌నంద‌న‌రావు ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంపై రాష్ట్ర డిజిపికి ఫిర్యాదు చేశారు. కేసులో నిష్ప‌క్ష‌పాతంగా విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దుబ్బాక‌, హుజూరాబాద్‌, మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో ప్రతిప‌క్ష నాయ‌కుల ఫోన్ ట్యాప్ చేశారు. ఈ మాట ఉప ఎన్నిక స‌మ‌యంలో చెప్పాను. 2020 న‌వంబ‌ర్‌లో నేను చెప్పిందే ఇపుడు నిజ‌మైంద‌న్నారు. గ‌తంలో సిఎంగా ఉన్న కెసిఆర్ ప్ర‌మేయం లేకుండా పోలీసులు ఫోన్ ట్యాప్ చేయ‌లేరు. ఈ కేసులో తొలి ముద్దాయిగా కెసిఆర్‌, రెండో ముద్దాయిగా హారీష్ రావు, మూడో ముద్దాయిగా అప్ప‌టి సిద్దిపేట క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డిని చేర్చాల‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.