తదుపరి ఎన్నికల ప్రధాన కమిషనర్గా రాజీవ్కుమార్
న్యూఢిల్లీ (CLiC2NEWS): కేంద్ర ఎన్నిక ప్రధాన అధికారిగా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వశాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 14న ప్రస్తుత ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మే 15న నూతన సిఇఒగా రాజీవ్ కుమార్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర న్యాయమంత్రి కిరణ్ రిజిజు రాజీవ్కు అభినందనలు తెలియజేశారు.