రాజ్కోట్: టిఆర్పి గేమజోన్లో ఘోర అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి
రాజ్కోట్ (CLiC2NEWS): గుజరాత్లోని రాజ్కోట్ పట్టణంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించి 11 మంది మృత్యువాత పడ్డారు. స్థానిక టిఆర్పి గేమ్జోన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో చిన్నారులు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇంకా పలువురు మంటల్లో చిక్కునట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రమాద ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్పందిస్తూ.. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులంతా తక్షణమే ప్రమాదస్థలానికి చేరుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఎక్స్లో పోస్టు చేశారు.