దేశానికే ఆదర్శంగా తెలంగాణ పోలిసింగ్ విధానం ఉండాలి: మంత్రి కెటిఆర్‌

రామ‌గుండం పోలీస్ క‌మిష‌న‌రేట్‌ (CLiC2NEWS): ప్రజా అభివృద్ధి సంక్షేమంలో దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ పాలన సాగుతుందని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంద‌ని.. మనపాలసీలు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయని ఆయ‌న తెలిపారు. సోమవారం రామగుండం పట్టణంలో పర్యటించిన మంత్రి అధునాతన హంగులతో జి ప్లస్ -2 పద్ధతిలో నిర్మించిన పోలీస్ కమిషనరేట్ భవనాన్ని ఆయ‌న‌ ప్రారంభించారు.

అనంతరం పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన‌ సమావేశంలో రాష్ట్ర మంత్ర‌లు కేటీఆర్మహమ్మద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి,  కొప్పుల ఈశ్వర్  పాల్గొన్నారు.

మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ  ప్రజలంతా శాంతియుతమైన జీవితం గడిపేందుకు దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుడితో సమానంగా అంతర్గత భద్రత కోసం మన పోలీసులు పనిచేస్తున్నారని మంత్రి అన్నారు. పోలీసులు చిత్తశుద్ధితో పనిచేస్తూ పకడ్బందీగా శాంతిభద్రతలను నిర్వహిస్తున్నందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులు కుమిలిపోతూ ఆవేదనతో పనిచేసేవారని, ఉద్యమం కోసం పోలీస్ కానిస్టేబుల్ కృష్ణయ్య తన ప్రాణాలను బలిదానం చేసుకున్న ఘటన దానికి నిదర్శనమని తెలిపారు.

ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత పోలీస్ అమరవీరుడు కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకున్నామని , ఉద్యోగం అందించడంతో పాటు కృష్ణయ్య కుమార్తె ప్రియాంకను డాక్టర్ చదివించామని, ఆమె కరీంనగర్ బస్తి దవాఖానాలో డాక్టర్ గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తుందని తెలిపారు. అమరవీరుడు పోలీస్ కృష్ణ కుటుంబాన్ని కాపాడుకున్న తీరుతో ప్రతి పోలీస్ కుటుంబానికి ఒక సందేశం పంపమని అన్నారు.

గతంలో What Bengal does Today, India will do Tomorrow అనే వారని, ప్రస్తుతం What Telangana does Today, India will do Tomorrow అనే పరిస్థితి వచ్చిందని, తెలంగాణ ఆచరించిన కార్యక్రమాలను దేశం అనుసరించిందని మంత్రి తెలిపారు.

 

రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత ప్రాధాన్యత శాంతిభద్రతల నిర్వహణ కోసం సిఎం కేసీఆర్ కల్పించారన్నారు. గతంలో కేవలం రెండు పోలీస్ కమిషనరేట్లు ఉండేవని.. ప్రస్తుతం అదనంగా ఏడు పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాదులో కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మించుకున్నామని ఆయన తెలిపారు.

రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్.. మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి లా & ఆర్డర్ కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇందుకు నిదర్శనం పోలీస్ శాఖకు అత్యధిక నిధులు కేటాయించారు. ఎక్కడైతే శాంతిభద్రతలు బాగుంటాయో అక్కడికే పెట్టుబడులు ఎక్కువగా వస్తాయని తద్వారా ఉద్యోగ కల్పన జరుగుతుందన్నారు. తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థ దేశానికే రోల్ మోడల్ అన్నారు. అనంతరం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి తమ సందేశాలు ఇచ్చారు.

అనంతరం పోలీస్ ప్రతినిధులు మంత్రుల బృందానికి జ్ఞాపికలు అందజేసి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పోలీస్ కార్పొరేషన్ ఎండి రాజీవ్ రతన్, మల్టీ జోన్ 1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, శాసన మండలి చీఫ్ విప్ భానుప్రసాదరావు, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, ఎమ్మెల్యేలు కోరు కంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, దివాకర్ రావు,, ఎమ్మెల్సీ రమణ లతోపాటు పలువురు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.