రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ప్రమాణం
న్యూఢిల్లీ (CLiC2NEWS): వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటులోని తన కార్యాలయంలో వద్ది రాజు రవిచంద్ర చేత రాజ్యసభ చైర్మన్ ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్రవెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.