కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త..
కొత్త సచివాలయం ప్రారంభోత్సవ వేళ..
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్తనందించింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ దస్త్రంపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 40 విభాగాల్లో ఉన్నటువంటి 5,544 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు.