బీహార్‌లో రోడ్డు ప్ర‌మాదం.. 8 మంది దుర్మ‌ర‌ణం

పాట్నా (CLiC2NEWS): బీహార్‌లోని పూర్నియా జిల్లాలో సోమవారం తెల్ల‌వారు జామున ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. పైపుల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపు త‌ప్పి బోల్తా పడడంతో ఎనిమిది మంది కూలీలు మృతి చెందారు. ఈ ప్ర‌మాదంలో మ‌రికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.

సిలిగురి-ఢిల్లీ నాలుగు లేన్ల జాతీయ రహదారి 57 ప‌రిస‌రాల్లోని జలల్‌ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాళీ దేవాలయం వద్ద తెల్లవారుజామున 3.30 గంటల స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది.

16 మంది బాధితులు రాజస్థాన్‌కు చెందిన వారని, వారిలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఘ‌ట‌న అనంత‌రం లారీ డ్రైవ‌ర్ పారిపోయారు. డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తులోకి జారుకోవ‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగి ఉండొచ్చ‌ని పోలీసులు ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.

Leave A Reply

Your email address will not be published.