కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురు మృతి

ఎల్లారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి జిల్లాలో ట్రాలీ ఆటోను లారీ ఢీకొని ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మ‌రో 21మందికి గాయాల‌య్యాయి. ఎల్లారెడ్డి మండ‌లం హ‌స‌న్‌ప‌ల్లి గేటు స‌మీపంలో ట్రాలీ ఆటోను ఎదురుగా వ‌చ్చిన లారీ ఢీకొట్టింది. మ‌ర‌ణించిన వారిలో ఆటో డ్రైవ‌ర్ సాయిలుతో పాటు ల‌చ్చ‌వ్వ‌, దేవ‌య్య‌, కంస‌వ్వ‌, కేశ‌య్య ఉన్నారు. గాయ‌ప‌డిన వారిని బాన్సువాడ ప్ర‌భుత్వాసుపత్రికి త‌ర‌లించారు. వీరిలో ప‌లువురి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.